పాదచారుల సౌకర్యమే లక్ష్యం.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ట్రాఫిక్ పోలీసులు
పాదచారుల సౌకర్యమే లక్ష్యం.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ట్రాఫిక్ పోలీసులు
Editor Desk
ఎల్బీనగర్, జూలై 25: నగరంలో పాదచారుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఫుట్పాత్ ఆక్రమణలపై వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. భాగ్యలత నుంచి హైకోర్టు కాలనీ కమాన్ వరకు సర్వీస్ రోడ్డు పక్కనున్న ఫుట్పాత్లను ఆక్రమించిన ఫర్నిచర్ దుకాణాలు, పండ్ల వ్యాపారులు, ఇతర వాణిజ్య సంస్థల ఆక్రమణలను అధికారులు తొలగించారు.
డ్రైవ్ సందర్భంగా వ్యాపారులకు ట్రాఫిక్ అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఫుట్పాత్లపై ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించవద్దని, ప్రజలు మరియు పాదచారులకు ఇబ్బందులు కలిగేలా వస్తువులను రహదారులపై ఉంచవద్దని సూచించారు. ట్రాఫిక్కు ఆటంకం కలిగించే ఆక్రమణలపై ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి, వనస్థలిపురం ట్రాఫిక్ ఎస్హెచ్వో శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఎస్ఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఫుట్పాత్లను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి