Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లాభదాయం లేకుండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా; సర్పంచ్ ప్రేమ్ ప్రసాద్ తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 26, 2026 09:30 AM

ఫతుల్లగూడలో వనమహోత్సవం.. మొక్కలు నాటి సందేశమిచ్చిన ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

ఫతుల్లగూడలో వనమహోత్సవం.. మొక్కలు నాటి సందేశమిచ్చిన ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

ఫతుల్లగూడలో వనమహోత్సవం.. మొక్కలు నాటి సందేశమిచ్చిన ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
July 26, 2026 07:10 AM 7 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హరితహారానికి శ్రీకారం

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. మొక్కలను నాటి సంరక్షించాలి

ఎల్బీనగర్, జూలై 25: పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా సమానంగా ముఖ్యమని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వనమహోత్సవాన్ని పురస్కరించుకుని నాగోల్ పరిధిలోని ఫతుల్లగూడ జంతు సంరక్షణ కేంద్రంలో శనివారం నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని హరితహారానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు. వాతావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కల పాత్ర కీలకమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దానిని పెంచే బాధ్యత తీసుకోవాలని సూచించారు. నగర హరితాభివృద్ధి కోసం అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ (శానిటేషన్) సి.ఎన్. రఘు ప్రసాద్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో, నాగోల్ సర్కిల్ డీసీ సంపత్‌తో పాటు యూబీడీ, వెటర్నరీ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హరితహారం లక్ష్యాల సాధనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అధికారులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News