కుమ్మరి వృత్తి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
కుమ్మరి వృత్తి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
P.Venkanna
స కుమ్మరి వృత్తి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి, కుమ్మరి కుటుంబాలకు అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేష్, రాష్ట్ర కార్యదర్శి మల్కాజిగిరి దయానంద కోరారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుమ్మరి సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సూర్యాపేట జిల్లా హడక్ కమిటీ జిల్లా కన్వీనర్గా సలిగంటి శ్రీనివాస్, కో-కన్వీనర్లుగా మాసంపల్లి సైదులు, బడిషా రామారావు, కంభంపాటి మధు, మారపాక రాములను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంప్రదాయ కుమ్మరి వృత్తిని పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మట్టి కళాకారులకు ఆర్థిక సహాయం, ఆధునిక పరికరాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. కుమ్మరి వృత్తిదారుల సంక్షేమం కోసం సంఘం ఐక్యంగా పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం నాయకులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి