Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రథయాత్ర విజయవంతానికి సహకరించిన వారికి అభినందనలు తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 26, 2026 08:25 PM

కుమ్మరి వృత్తి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

కుమ్మరి వృత్తి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

కుమ్మరి వృత్తి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
July 26, 2026 06:23 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : penpahad
P.Venkanna


స కుమ్మరి వృత్తి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి, కుమ్మరి కుటుంబాలకు అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేష్, రాష్ట్ర కార్యదర్శి మల్కాజిగిరి దయానంద కోరారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుమ్మరి సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సూర్యాపేట జిల్లా హడక్ కమిటీ జిల్లా కన్వీనర్‌గా సలిగంటి శ్రీనివాస్, కో-కన్వీనర్లుగా మాసంపల్లి సైదులు, బడిషా రామారావు, కంభంపాటి మధు, మారపాక రాములను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంప్రదాయ కుమ్మరి వృత్తిని పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మట్టి కళాకారులకు ఆర్థిక సహాయం, ఆధునిక పరికరాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. కుమ్మరి వృత్తిదారుల సంక్షేమం కోసం సంఘం ఐక్యంగా పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం నాయకులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News