Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తిరుమలగిరి మండల మోడ్రన్ కబడ్డీ అధ్యక్షుడుగా భూమా అంజనేయులు తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 26, 2026 06:55 PM

టీజీసీజీటీఏ జిల్లా అధ్యక్షుడు గా ప్రవీణ్‌రెడ్డి ప్రధాన కార్యదర్శిగా నర్సింగు కోటయ్య.

టీజీసీజీటీఏ జిల్లా అధ్యక్షుడు గా ప్రవీణ్‌రెడ్డి ప్రధాన కార్యదర్శిగా నర్సింగు కోటయ్య.

టీజీసీజీటీఏ జిల్లా అధ్యక్షుడు గా  ప్రవీణ్‌రెడ్డి ప్రధాన కార్యదర్శిగా నర్సింగు కోటయ్య.
July 26, 2026 03:27 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీజీటీఏ) నల్గొండ జిల్లా కమిటీ ఎన్నికలు ఆదివారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్)లో ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల ప్రధాన అధికారిగా డాక్టర్ బి. వీరన్న వ్యవహరించగా, డాక్టర్ కడారు సురేందర్‌రెడ్డి ప్యానెల్ సభ్యులు జిల్లా బాధ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

జిల్లా అధ్యక్షుడిగా నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం సహాయ ఆచార్యుడు కే. ప్రవీణ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్జీ కళాశాల (అటానమస్) నల్గొండకు చెందిన చరిత్ర విభాగం సహాయ ఆచార్యుడు నర్సింగు కోటయ్య, జిల్లా కోశాధికారిగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్)కు చెందిన ఈ. రాంరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన కమిటీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోపి, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బెల్లి యాదయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాజారామ్ అభినందించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రాజారామ్ మాట్లాడుతూ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక ఉన్నత విద్యా అధ్యాపకుల ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. అధ్యాపకుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నూతన ప్రధాన కార్యదర్శి నర్సింగు కోటయ్య మాట్లాడుతూ జిల్లా ప్రాథమిక సభ్యుల సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, ఉద్యోగుల హక్కులు, గౌరవ పరిరక్షణకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

కార్యక్రమంలో ప్రొఫెసర్ అరవింద, డాక్టర్ వెంకటకృష్ణ, ఈ. రాంరెడ్డి, సీహెచ్ అజయ్‌కుమార్, డాక్టర్ హరిత, ఎం. వెంకటరెడ్డి, కె. శివరాణి, గంజి శ్రీనివాస్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News