ప్రజా సమస్యలపై కౌన్సిల్లో గళమెత్తుతా: బిజెపి ఫ్లోర్ లీడర్ బుడ్డ సురేష్
ప్రజా సమస్యలపై కౌన్సిల్లో గళమెత్తుతా: బిజెపి ఫ్లోర్ లీడర్ బుడ్డ సురేష్
K.RAVI
చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కౌన్సిల్లో గళమెత్తి పనిచేస్తానని నూతనంగా ఎన్నికైన బిజెపి ఫ్లోర్ లీడర్, 18వ వార్డు కౌన్సిలర్ బుడ్డ సురేష్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో చౌటుప్పల మున్సిపల్ శాఖ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సీనియర్ నాయకుల సమావేశంలో బిజెపి ఫ్లోర్ లీడర్ ఎన్నిక జరిగింది. కౌన్సిలర్లందరూ ఏకగ్రీవంగా బుడ్డ సురేష్ను ఫ్లోర్ లీడర్గా ఎన్నుకున్నారు.ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో సురేష్ను సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి, కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దూడల బిక్షం గౌడ్, రమణగొని శంకర్, ఆలే శ్రీలత చిరంజీవి, పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, ముత్యాల భూపాల్ రెడ్డి, పోలోజు శ్రీధర్ బాబు, ఉడుగు వెంకటేశం గౌడ్, ఉబ్బు బుచ్చయ్య, కాసుల వెంకటేశం, కడవేరు పాండు, గుండెబోయిన వేణు, పర్నె అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి