పట్టణంలోని గీత మందిరం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర విజయవంతం కావడంలో సహకరించిన నిర్వాహకులు, భక్తులు, స్వచ్ఛంద సేవకులకు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అభినందనలు తెలిపారు.
రథయాత్ర విజయవంతం చేసిన సందర్భంగా నిర్వహించిన కృతజ్ఞతా సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. భక్తి, ఐక్యత, సామాజిక సేవా భావాన్ని పెంపొందించే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
శ్రీ జగన్నాథ రథయాత్రను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన నిర్వాహకులు, భక్తులు, స్వచ్ఛంద సేవకుల సేవలను కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి సమాజంలో ఐక్యతను బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి