Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రథయాత్ర విజయవంతానికి సహకరించిన వారికి అభినందనలు తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 26, 2026 09:14 PM

జాతీయ స్థాయిలో కొప్పుల వెంకట్‌రెడ్డికి అరుదైన గౌరవం. 'నేషనల్ ఉత్తమ సర్పంచ్–2026' అవార్డు అందజేత.

జాతీయ స్థాయిలో కొప్పుల వెంకట్‌రెడ్డికి అరుదైన గౌరవం. 'నేషనల్ ఉత్తమ సర్పంచ్–2026' అవార్డు అందజేత.

జాతీయ స్థాయిలో కొప్పుల వెంకట్‌రెడ్డికి అరుదైన గౌరవం.  'నేషనల్ ఉత్తమ సర్పంచ్–2026' అవార్డు అందజేత.
July 26, 2026 07:17 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి,

మోటకొండూరు మండలం కొండాపురం గ్రామ సర్పంచ్, యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొప్పుల వెంకట్‌రెడ్డికి 'నేషనల్ ఉత్తమ సర్పంచ్–2026' అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన భవన్‌లో జరిగిన వేడుకలో నేషనల్ బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణమూర్తి చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందజేశారు.గ్రామాభివృద్ధి, సామాజిక సేవ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కొప్పుల వెంకట్‌రెడ్డి అందించిన విశేష సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసినట్లు అకాడమీ ప్రతినిధులు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తూ ఆదర్శ సర్పంచ్‌గా నిలిచారని ప్రశంసించారు.

అవార్డు స్వీకరించిన అనంతరం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, "పదవి కోసం కాదు... ప్రజాసేవ కోసం పనిచేశాను. గ్రామ ప్రజలు నాపై ఉంచిన నమ్మకమే ఈ జాతీయ గౌరవానికి కారణం" అని అన్నారు.గ్రామంలో రూ.50 లక్షలతో ఆలయ నిర్మాణం చేపట్టామని, ఆరు గ్రామాల ప్రజల చిరకాల కల అయిన వంతెన నిర్మాణానికి ప్రభుత్వ నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించామని తెలిపారు. మోటకొండూరు మండలానికి స్వర్గపురి రథాన్ని అందజేయడంతో పాటు ప్రజల అవసరాల్లో ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నానని పేర్కొన్నారు.

ఈ గౌరవాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నానని, రాబోయే రోజుల్లో జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి సర్పంచ్ తమ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అకాడమీ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News