Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రథయాత్ర విజయవంతానికి సహకరించిన వారికి అభినందనలు తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 26, 2026 09:12 PM

బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చొద్దు..

బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చొద్దు..

బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చొద్దు..
July 26, 2026 07:13 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నల్లగొండ–సూర్యాపేట మార్గాన్నే కొనసాగించాలి


ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి..


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి


శంషాబాద్ నుంచి నల్లగొండ, సూర్యాపేట మీదుగా చెన్నై వరకు ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అలైన్‌మెంట్ మారే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గతంలో శంషాబాద్–నల్లగొండ–సూర్యాపేట మార్గంలోనే బుల్లెట్ ట్రైన్‌ను తీసుకురావాలని ప్రతిపాదనలు వెలువడటంతో ఈ ప్రాంత ప్రజల్లో భారీ ఆశలు చిగురించాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు బుల్లెట్ ట్రైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.

బుల్లెట్ ట్రైన్ అన్ని రైల్వే స్టేషన్లలో ఆగకపోయినా, జిల్లా కేంద్రాలైన నల్లగొండ, సూర్యాపేటలకు సమీపంలో స్టేషన్లు ఏర్పాటు చేస్తే విద్య, వైద్యం, వ్యాపారం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా హైదరాబాద్–చెన్నై మధ్య ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు.

అయితే, గతంలో ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌ను మార్చి మరో మార్గంలో బుల్లెట్ ట్రైన్‌ను తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఈ ప్రాజెక్టు దూరమైతే భవిష్యత్ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పునరాలోచన చేసి, మొదట ప్రతిపాదించిన శంషాబాద్–నల్లగొండ–సూర్యాపేట మార్గాన్నే కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ప్రజా నాయకులు ఈ అంశాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పాత అలైన్‌మెంట్‌ను కొనసాగించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా అమలైతే ఈ ప్రాంత ఆర్థిక, పారిశ్రామిక, విద్యా, ఉపాధి రంగాల్లో గణనీయమైన అభివృద్ధికి దోహదపడుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News