PRINT TIME: July 26, 2026 11:46 PM
నూతన సీఐ రవీందర్ను మర్యాదపూర్వకంగా కలిసిన సునీల్ రెడ్డి
నూతన సీఐ రవీందర్ను మర్యాదపూర్వకంగా కలిసిన సునీల్ రెడ్డి
July 26, 2026 09:26 PM
55 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఆదివారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ఎం. రవీందర్ను ఇస్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీ సాయి త్రీశూల్ సేవా సమితి, హోటల్ సాయి త్రీశూల్ గ్రాండ్ అధినేత సునీల్ రెడ్డి, కలినాథ్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, సంజీవ్, వినోద్ కుమార్,భరత్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు సత్వర, పారదర్శక సేవలు అందిస్తూ పటాన్చెరు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సీఐ ఎం. రవీందర్ సన్మానం చేసినందుకు సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల సహకారంతో చట్టం, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి