హితం విద్యార్థులకు 'CSI' బలం
హితం విద్యార్థులకు 'CSI' బలం
Editor Desk
పరిశ్రమతో అనుసంధానానికి కొత్త వేదిక.. సాంకేతిక నైపుణ్యాల పెంపునకు చాప్టర్ దోహదం
హైదరాబాద్: విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (హితం)లో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (CSI) స్టూడెంట్ చాప్టర్ ఘనంగా ప్రారంభమైంది. హితం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్యాంపస్లోని 'ది కాన్క్లేవ్' వేదికగా నిర్వహించిన కార్యక్రమానికి పరిశ్రమ, విద్యారంగ ప్రముఖులు హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా అకాడెమిక్ అండ్ ఇండస్ట్రీ కౌన్సిల్ హెడ్ చంద్ర ఎస్. దాసకా, మైక్రోసాఫ్ట్ సీనియర్ డైరెక్టర్ (ప్రొడక్ట్ మేనేజ్మెంట్) భరత్ కుమార్ పి. ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. వృత్తిపరమైన సంస్థల్లో సభ్యత్వం ద్వారా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, పరిశోధన అవకాశాలు, పరిశ్రమతో అనుసంధానం, ఉపాధి అవకాశాలను మరింత విస్తరించుకోవచ్చని పేర్కొన్నారు. CSI నిర్వహించే వర్క్షాప్లు, హ్యాకథాన్లు, సెమినార్లు, సాంకేతిక పోటీల్లో చురుకుగా పాల్గొని భవిష్యత్కు సిద్ధం కావాలని సూచించారు.
హితం ప్రిన్సిపాల్ డా. ఎస్. అరవింద్ మాట్లాడుతూ, CSI స్టూడెంట్ చాప్టర్ విద్యార్థులకు పరిశ్రమ నిపుణులతో ప్రత్యక్ష అనుసంధానం కల్పించడంతో పాటు వర్క్షాప్లు, సెమినార్లు, హ్యాకథాన్లు, నెట్వర్కింగ్ అవకాశాలకు వేదికగా నిలుస్తుందని తెలిపారు. విద్యా రంగం–పరిశ్రమ అవసరాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి విద్యార్థుల కెరీర్కు బలమైన పునాది వేయడంలో ఈ చాప్టర్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీన్ అకాడెమిక్స్ డా. బి. సురేంద్ర, కన్వీనర్ ప్రీతి సి. ఎం., కో-కన్వీనర్లు డా. ధర్మేంద్ర కుమార్ రాయ్, టి. రాఘవేంద్ర గుప్త, అధ్యాపకులు, CSI ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగియగా, CSI సభ్యత్వం ద్వారా లభించే అవకాశాలపై విద్యార్థులు విశేష ఆసక్తి వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి