హామీని నిలబెట్టుకుని ప్రతిభావంతులైన విద్యార్థులను నగదు బహుమతులతో సత్కరించిన దోసపల్లి సర్పంచ్ బిరదర్ దత్తు
హామీని నిలబెట్టుకుని ప్రతిభావంతులైన విద్యార్థులను నగదు బహుమతులతో సత్కరించిన దోసపల్లి సర్పంచ్ బిరదర్ దత్తు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూరు మండల పరిధిలోని దోసపల్లి గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బిరదర్ దత్తు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ మరో హామీని నెరవేర్చారు. సోమవారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో 2025–26 విద్యా సంవత్సరంలో జడ్పీహెచ్ఎస్ మనూరు పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణులైన గ్రామానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను నగదు బహుమతులతో ప్రోత్సహించారు. బిరదర్ అపర్ణకు ప్రథమ బహుమతిగా రూపాయలు 5,100, బిరదర్ శ్రీనిజకు ద్వితీయ బహుమతిగా రూపాయలు 2,500 అందజేయడంతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిరదర్ దత్తు మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాలు, డాక్టర్ అమృత్, రాజశేఖర్, అశోక్, సత్యనారాయణ, నారాయణ, రాజ్కుమార్, రవికుమార్, జయరాజ్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి