Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల పిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 27, 2026 05:42 PM

హామీని నిలబెట్టుకుని ప్రతిభావంతులైన విద్యార్థులను నగదు బహుమతులతో సత్కరించిన దోసపల్లి సర్పంచ్ బిరదర్ దత్తు

హామీని నిలబెట్టుకుని ప్రతిభావంతులైన విద్యార్థులను నగదు బహుమతులతో సత్కరించిన దోసపల్లి సర్పంచ్ బిరదర్ దత్తు

హామీని నిలబెట్టుకుని ప్రతిభావంతులైన విద్యార్థులను నగదు బహుమతులతో సత్కరించిన దోసపల్లి సర్పంచ్ బిరదర్ దత్తు
July 27, 2026 03:19 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూరు మండల పరిధిలోని దోసపల్లి గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బిరదర్ దత్తు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ మరో హామీని నెరవేర్చారు. సోమవారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో 2025–26 విద్యా సంవత్సరంలో జడ్‌పీహెచ్‌ఎస్ మనూరు పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణులైన గ్రామానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను నగదు బహుమతులతో ప్రోత్సహించారు. బిరదర్ అపర్ణకు ప్రథమ బహుమతిగా రూపాయలు 5,100, బిరదర్ శ్రీనిజకు ద్వితీయ బహుమతిగా రూపాయలు 2,500 అందజేయడంతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిరదర్ దత్తు మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాలు, డాక్టర్ అమృత్, రాజశేఖర్, అశోక్, సత్యనారాయణ, నారాయణ, రాజ్‌కుమార్, రవికుమార్, జయరాజ్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News