రాష్ట్ర హామీల కమిటీ ఛైర్మన్గా డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి బాధ్యతల స్వీకారం
రాష్ట్ర హామీల కమిటీ ఛైర్మన్గా డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి బాధ్యతల స్వీకారం
Krishna
హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ) ప్రాంగణంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసనసభ హామీల కమిటీ ఛైర్మన్గా ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై పుష్పగుచ్ఛం అందజేసి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, స్పీకర్కు మరియు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలును వేగవంతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, పారదర్శకంగా బాధ్యతలను నిర్వహించడం తన లక్ష్యమని పేర్కొన్నారు. హామీల కమిటీ ద్వారా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి మరింత సమర్థవంతంగా సేవలందిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నారాయణఖేడ్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డికి అభినందనలు తెలియజేసి నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి