ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల స్వీకరించిన :- జిల్లా ఎస్. పి
ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల స్వీకరించిన :- జిల్లా ఎస్. పి
Anjali
పుట్టపర్తి జిల్లా, పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం - PGRS) కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 70, ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు.
ఫిర్యాదుదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ గారు, ప్రతి వినతిపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా తగిన చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. సమస్యలు విన్నవించెందుకు వచ్చిన వికలాంగుల వద్దకే జిల్లా ఎస్పీ గారు వెళ్లి వారి ఫిర్యాదులను పరిశీలించి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వారికి భరోసా కల్పించారు.
ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, ఒకే సమస్యపై పునరావృత ఫిర్యాదులు రాకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, అత్తింటి వేధింపులు, సైబర్ నేరాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి.
కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన, ఐపీఎస్, డి టి ఆర్ బి , ఎయిర్పోర్ట్ సీ ఐ లు ,లక్ష్మీకాంత్ రెడ్డి, బొజ్జప్ప, మరియు పోలీసు, సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి