హద్నూర్ పోలీస్ స్టేషన్లో రౌడీ మేళా.. రికార్డుల నవీకరణ, వేలిముద్రల నమోదు
హద్నూర్ పోలీస్ స్టేషన్లో రౌడీ మేళా.. రికార్డుల నవీకరణ, వేలిముద్రల నమోదు
Krishna
హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఎస్సై దోమ సుజిత్ సమక్షంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా రౌడీ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు,రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరణ్ పాల్గొని రౌడీ షీటర్లను వ్యక్తిగతంగా పరిశీలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. వారి ప్రవర్తన, ప్రస్తుతం చేస్తున్న కార్యకలాపాలు, నివాస వివరాలు, గత కేసుల స్థితిగతులను పరిశీలించి పోలీసు రికార్డులను నవీకరించారు. ఇప్పటివరకు వేలిముద్రలు నమోదు చేయని రౌడీ షీటర్ల వేలిముద్రలను కూడా ఈ సందర్భంగా నమోదు చేశారు. భవిష్యత్తులో ఎలాంటి శిక్షార్హ నేరాలకు పాల్పడకుండా చట్టాన్ని గౌరవిస్తూ సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని అధికారులు సూచించారు. తిరిగి నేరాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ శాంతిభద్రతలను కాపాడేందుకు, నేరాలను అరికట్టేందుకు ఇటువంటి రౌడీ మేళాలు, కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి