హెబ్రోన్ దైవ సేవకులకు ఘన వీడ్కోలు..
హెబ్రోన్ దైవ సేవకులకు ఘన వీడ్కోలు..
NM Yadav
నల్గొండ :నల్గొండ టౌన్ హెబ్రోన్ చర్చి పరిధిలోని మౌంట్ గేరీజిము కొండ ప్రేయర్ హౌస్లో దైవ సేవకులుగా సేవలు అందించిన బ్రదర్ బుర్రి జాకోబ్, సేవకురాలు రేచల్ దంపతులకు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత ఐదేళ్లుగా వీరు అందించిన ఆత్మీయ సేవలను గుర్తించి, ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్స్కు బదిలీ అయిన సందర్భంగా ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హెబ్రోన్ నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ అశోక్ గాబ్రియల్ దైవ సేవకుల దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించి, వారి భవిష్యత్ పరిచర్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఐదేళ్ల కాలంలో సంఘ అభివృద్ధికి, ప్రజల్లో ఆత్మీయ చైతన్యానికి వారు చేసిన కృషి ప్రశంసనీయమని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో చర్చి సభ్యులు, పెద్దలు పోలే డేవిడ్, ఎం. లక్ష్మయ్య, వి.ఎస్. ప్రవీణ్, పోలీస్ సంజీవ, మిద్దె సంజీవయ్య, సుధాకర్, సమూయేలు, మలాకి, విజయ్ కుమార్, జోసెఫ్, నరేష్లతో పాటు ఇతర దైవ సేవకులు పాల్, కృపాదానం, నవీన్, అనిల్ పాల్, ఆనంద్, పలువురు సిస్టర్స్ మరియు చర్చి విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవకులకు వీడ్కోలు పలికారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి