నీటి సంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి
నీటి సంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి
K.RAVI
చౌటుప్పల్లో మండల స్థాయి సమన్వయ సమావేశం
జడ్పీ సీఈఓ శోభారాణి, మండల ప్రత్యేకాధికారి రవీందర్
ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు గ్రామ స్థాయిలో నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. చౌటుప్పల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల ప్రత్యేకాధికారి పి. రవీందర్ అధ్యక్షతన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ఎన్. శోభారాణి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కె. శ్రీలత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో 'వీబీజీ రామ్ జీ జలసిరి' కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చేపడుతున్న నీటి సంరక్షణ పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట కుంటలు, ఫామ్ పాండ్లు తవ్వడంతో పాటు గ్రామాల్లోని బోర్లను రీఛార్జ్ చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. అలాగే గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలుపై సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, తహసీల్దార్, మండల పంచాయతీ అధికారి (ఎంపీవో), పంచాయతీ కార్యదర్శులు, ఏపీఓ, ఈసీ, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ విఓ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి