Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ ఐఎన్‌టీయూసీ 327 యూనియన్ అధ్యక్షుడిగా కే. పవన్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 28, 2026 10:41 PM

నీటి సంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి

నీటి సంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి

నీటి సంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి
July 28, 2026 07:45 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో మండల స్థాయి సమన్వయ సమావేశం

జడ్పీ సీఈఓ శోభారాణి, మండల ప్రత్యేకాధికారి రవీందర్

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు గ్రామ స్థాయిలో నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. చౌటుప్పల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల ప్రత్యేకాధికారి పి. రవీందర్ అధ్యక్షతన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ​ఈ సమావేశానికి యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ఎన్. శోభారాణి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కె. శ్రీలత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ​సమావేశంలో 'వీబీజీ రామ్ జీ జలసిరి' కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చేపడుతున్న నీటి సంరక్షణ పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట కుంటలు, ఫామ్ పాండ్లు తవ్వడంతో పాటు గ్రామాల్లోని బోర్లను రీఛార్జ్ చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. అలాగే గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలుపై సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, తహసీల్దార్, మండల పంచాయతీ అధికారి (ఎంపీవో), పంచాయతీ కార్యదర్శులు, ఏపీఓ, ఈసీ, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ విఓ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News