Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 04:16 AM

జిమ్ ట్రైనర్ మృతి కేసులో మహిళ అరెస్ట్ వేధింపులే కారణమా..? పోలీసుల దర్యాప్తు కొనసాగింపు

జిమ్ ట్రైనర్ మృతి కేసులో మహిళ అరెస్ట్ వేధింపులే కారణమా..? పోలీసుల దర్యాప్తు కొనసాగింపు

జిమ్ ట్రైనర్ మృతి కేసులో మహిళ అరెస్ట్ వేధింపులే కారణమా..? పోలీసుల దర్యాప్తు కొనసాగింపు
14-04-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్ణాటకలో జిమ్ ట్రైనర్ అనుమానాస్పద మృతి కేసు కలకలం రేపుతోంది. 28 ఏళ్ల ఫిట్‌నెస్ ట్రైనర్ దిలీప్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో 42 ఏళ్ల మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, దిలీప్‌కు జిమ్‌కు వచ్చిన యోగిత అనే మహిళతో పరిచయం ఏర్పడి, అది వ్యక్తిగత సంబంధంగా మారింది. ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసి, పోలీస్ స్టేషన్‌లో పరస్పరం దూరంగా ఉండాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

అయితే తరువాత కూడా ఇద్దరి మధ్య సంబంధం కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డబ్బు, ఆస్తి విషయాల్లో మహిళ ఒత్తిడి తీసుకొచ్చినట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ వేధింపులు తట్టుకోలేక దిలీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

Sthanikam

జిమ్ ట్రైనర్ మృతి కేసులో మహిళ అరెస్ట్ వేధింపులే కారణమా..? పోలీసుల దర్యాప్తు కొనసాగింపు

Article Image

కర్ణాటకలో జిమ్ ట్రైనర్ అనుమానాస్పద మృతి కేసు కలకలం రేపుతోంది. 28 ఏళ్ల ఫిట్‌నెస్ ట్రైనర్ దిలీప్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో 42 ఏళ్ల మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, దిలీప్‌కు జిమ్‌కు వచ్చిన యోగిత అనే మహిళతో పరిచయం ఏర్పడి, అది వ్యక్తిగత సంబంధంగా మారింది. ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసి, పోలీస్ స్టేషన్‌లో పరస్పరం దూరంగా ఉండాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

అయితే తరువాత కూడా ఇద్దరి మధ్య సంబంధం కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డబ్బు, ఆస్తి విషయాల్లో మహిళ ఒత్తిడి తీసుకొచ్చినట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ వేధింపులు తట్టుకోలేక దిలీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News