అర్హులైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి..
అర్హులైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి..
Editor Desk
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోరుతూ సాగించిన పోరాటంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క ఉద్యమకారుడిని గుర్తించి తగిన న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల హక్కుల సాధన సమితి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతే శోభన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షులు రొక్కం లక్ష్మారెడ్డి ప్రధాన కార్యదర్శి రుద్రాల స్వామి మాదిగ, ఉపాధ్యక్షులు సపావత్ మోహన్ నాయక్, గౌరవ అధ్యక్షుడు డబ్బికార్ మధుసూదన్ లు ఉద్యమకారుల సంక్షేమానికి తీసుకోవలసిన పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. ఉద్యమ సమయంలో ఎన్నో అవమానాలు కష్టాలు కేసులు ఎదుర్కొని పోరాటం చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులను గుర్తించాలని కమిటీ వేయడం శుభసూచకమన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఉద్యమకారుడు ఆనందం వ్యక్తపరుస్తున్నారని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి