సింగరేణి అధికారుల ఫిర్యాదుపై బాల్క సుమన్కు 14 రోజుల రిమాండ్
సింగరేణి అధికారుల ఫిర్యాదుపై బాల్క సుమన్కు 14 రోజుల రిమాండ్
Komidala Mahender reddy
నాంపల్లి కోర్టు ఆదేశాలు.. చంచల్గూడ జైలుకు తరలింపు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సింగరేణి అధికారుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరచగా, వాదనలు విన్న న్యాయస్థానం రిమాండ్కు ఆదేశించింది. అనంతరం ఆయనను చంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.
సింగరేణి అధికారులపై విధి నిర్వహణలో ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 326(g), 351(3), 353(1)(b), 55, 61(2)(a)తో పాటు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ప్రివెన్షన్ యాక్ట్ (PDPPA) సెక్షన్ 4 కింద అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు.కేసు దర్యాప్తు కొనసాగుతోందని, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి