Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:14 AM

సింగరేణి అధికారుల ఫిర్యాదుపై బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్

సింగరేణి అధికారుల ఫిర్యాదుపై బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్

సింగరేణి అధికారుల ఫిర్యాదుపై బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్
31-05-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నాంపల్లి కోర్టు ఆదేశాలు.. చంచల్‌గూడ జైలుకు తరలింపు.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సింగరేణి అధికారుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరచగా, వాదనలు విన్న న్యాయస్థానం రిమాండ్‌కు ఆదేశించింది. అనంతరం ఆయనను చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.

సింగరేణి అధికారులపై విధి నిర్వహణలో ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 326(g), 351(3), 353(1)(b), 55, 61(2)(a)తో పాటు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ప్రివెన్షన్ యాక్ట్ (PDPPA) సెక్షన్ 4 కింద అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు.కేసు దర్యాప్తు కొనసాగుతోందని, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


Sthanikam

సింగరేణి అధికారుల ఫిర్యాదుపై బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్

Article Image

నాంపల్లి కోర్టు ఆదేశాలు.. చంచల్‌గూడ జైలుకు తరలింపు.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సింగరేణి అధికారుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరచగా, వాదనలు విన్న న్యాయస్థానం రిమాండ్‌కు ఆదేశించింది. అనంతరం ఆయనను చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.

సింగరేణి అధికారులపై విధి నిర్వహణలో ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 326(g), 351(3), 353(1)(b), 55, 61(2)(a)తో పాటు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ప్రివెన్షన్ యాక్ట్ (PDPPA) సెక్షన్ 4 కింద అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు.కేసు దర్యాప్తు కొనసాగుతోందని, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News