Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 02:11 AM

నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ నాయకులు

నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ నాయకులు

నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ నాయకులు
May 30, 2026 08:14 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మిగనూరు, : ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ పాఠశాల గుర్తింపును రద్దు చేసి చర్యలు తీసుకోవాలని డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మిగనూరు సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా పీడీఎస్‌ఓ రాష్ట్ర నాయకుడు తిరుమలేష్, డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ సెలవు దినాల్లో కూడా అడ్మిషన్ల పేరుతో ఉపాధ్యాయులతో పని చేయించుకోవడం, సరైన ధ్రువపత్రాలు లేకుండానే ఆధార్ కార్డులతో ప్రవేశాలు కల్పించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, టెక్నో కోర్సులు, ఒలింపియాడ్ పరీక్షల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఫీజుల పట్టిక ప్రదర్శించకుండా ర్యాంకుల పేరుతో ప్రచారం చేసుకుంటూ విద్యను వ్యాపార వస్తువుగా మార్చారని ఆరోపించారు.

విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే విద్యాశాఖ కార్యాలయం ఎదుట దశలవారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ధర్నాలో విద్యార్థి సంఘాల నాయకులు మల్లికార్జున, రంగస్వామి, విరేష్, ప్రవీణ్, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News