నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.డీఎస్ఎఫ్, పీడీఎస్ఓ నాయకులు
నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.డీఎస్ఎఫ్, పీడీఎస్ఓ నాయకులు
Editor Desk
ఎమ్మిగనూరు, : ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ పాఠశాల గుర్తింపును రద్దు చేసి చర్యలు తీసుకోవాలని డీఎస్ఎఫ్, పీడీఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మిగనూరు సర్కిల్లో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పీడీఎస్ఓ రాష్ట్ర నాయకుడు తిరుమలేష్, డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ సెలవు దినాల్లో కూడా అడ్మిషన్ల పేరుతో ఉపాధ్యాయులతో పని చేయించుకోవడం, సరైన ధ్రువపత్రాలు లేకుండానే ఆధార్ కార్డులతో ప్రవేశాలు కల్పించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బూట్లు, టెక్నో కోర్సులు, ఒలింపియాడ్ పరీక్షల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఫీజుల పట్టిక ప్రదర్శించకుండా ర్యాంకుల పేరుతో ప్రచారం చేసుకుంటూ విద్యను వ్యాపార వస్తువుగా మార్చారని ఆరోపించారు.
విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే విద్యాశాఖ కార్యాలయం ఎదుట దశలవారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ధర్నాలో విద్యార్థి సంఘాల నాయకులు మల్లికార్జున, రంగస్వామి, విరేష్, ప్రవీణ్, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి