Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:55 AM

నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ నాయకులు

నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ నాయకులు

నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ నాయకులు
30-05-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మిగనూరు, : ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ పాఠశాల గుర్తింపును రద్దు చేసి చర్యలు తీసుకోవాలని డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మిగనూరు సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా పీడీఎస్‌ఓ రాష్ట్ర నాయకుడు తిరుమలేష్, డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ సెలవు దినాల్లో కూడా అడ్మిషన్ల పేరుతో ఉపాధ్యాయులతో పని చేయించుకోవడం, సరైన ధ్రువపత్రాలు లేకుండానే ఆధార్ కార్డులతో ప్రవేశాలు కల్పించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, టెక్నో కోర్సులు, ఒలింపియాడ్ పరీక్షల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఫీజుల పట్టిక ప్రదర్శించకుండా ర్యాంకుల పేరుతో ప్రచారం చేసుకుంటూ విద్యను వ్యాపార వస్తువుగా మార్చారని ఆరోపించారు.

విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే విద్యాశాఖ కార్యాలయం ఎదుట దశలవారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ధర్నాలో విద్యార్థి సంఘాల నాయకులు మల్లికార్జున, రంగస్వామి, విరేష్, ప్రవీణ్, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ నాయకులు

Article Image

ఎమ్మిగనూరు, : ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ పాఠశాల గుర్తింపును రద్దు చేసి చర్యలు తీసుకోవాలని డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మిగనూరు సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా పీడీఎస్‌ఓ రాష్ట్ర నాయకుడు తిరుమలేష్, డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ సెలవు దినాల్లో కూడా అడ్మిషన్ల పేరుతో ఉపాధ్యాయులతో పని చేయించుకోవడం, సరైన ధ్రువపత్రాలు లేకుండానే ఆధార్ కార్డులతో ప్రవేశాలు కల్పించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, టెక్నో కోర్సులు, ఒలింపియాడ్ పరీక్షల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఫీజుల పట్టిక ప్రదర్శించకుండా ర్యాంకుల పేరుతో ప్రచారం చేసుకుంటూ విద్యను వ్యాపార వస్తువుగా మార్చారని ఆరోపించారు.

విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే విద్యాశాఖ కార్యాలయం ఎదుట దశలవారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ధర్నాలో విద్యార్థి సంఘాల నాయకులు మల్లికార్జున, రంగస్వామి, విరేష్, ప్రవీణ్, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News