Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 11:11 AM

వరి కొయ్యలను కాల్చొద్దు.. చట్టపరమైన చర్యలు తప్పవు: కలెక్టర్, ఎస్పీ

వరి కొయ్యలను కాల్చొద్దు.. చట్టపరమైన చర్యలు తప్పవు: కలెక్టర్, ఎస్పీ

వరి కొయ్యలను కాల్చొద్దు.. చట్టపరమైన చర్యలు తప్పవు: కలెక్టర్, ఎస్పీ
30-05-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

- వ్యవసాయాన్ని కాపాడుకుందాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం


సూర్యాపేట మండలం కాసారాబాద్ గ్రామంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహ పాల్గొని వరి కొయ్యలను తగలబెట్టవద్దని రైతులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వరి పంట కోత అనంతరం పొలాల్లో మిగిలే కొయ్యలను కాల్చడం వల్ల భూమి సహజ సారవంతత దెబ్బతింటుందని, నేలలోని సూక్ష్మజీవులు నశించి పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుందని వివరించినట్లు తెలిపారు.

వరి కొయ్యల దహనం కారణంగా రైతులు ఎరువులపై అధిక వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్లు తెలిపారు. అలాగే సమీపంలోని చెట్లు, వ్యవసాయ పరికరాలు, విద్యుత్ లైన్లు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించినట్లు తెలిపారు.

పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలపడం ద్వారా భూసారం పెరిగి నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని రైతులకు సూచించినట్లు తెలిపారు. ఎవరైనా వరి కొయ్యలను తగలబెట్టి ప్రమాదాలకు కారణమైతే సంబంధిత వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించినట్లు తెలిపారు.

రైతులు బాధ్యతాయుతంగా వ్యవహరించి వ్యవసాయాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించాలని అధికారులు పిలుపునిచ్చినట్లు తెలిపారు

Sthanikam

వరి కొయ్యలను కాల్చొద్దు.. చట్టపరమైన చర్యలు తప్పవు: కలెక్టర్, ఎస్పీ

Article Image

- వ్యవసాయాన్ని కాపాడుకుందాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం


సూర్యాపేట మండలం కాసారాబాద్ గ్రామంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహ పాల్గొని వరి కొయ్యలను తగలబెట్టవద్దని రైతులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వరి పంట కోత అనంతరం పొలాల్లో మిగిలే కొయ్యలను కాల్చడం వల్ల భూమి సహజ సారవంతత దెబ్బతింటుందని, నేలలోని సూక్ష్మజీవులు నశించి పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుందని వివరించినట్లు తెలిపారు.

వరి కొయ్యల దహనం కారణంగా రైతులు ఎరువులపై అధిక వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్లు తెలిపారు. అలాగే సమీపంలోని చెట్లు, వ్యవసాయ పరికరాలు, విద్యుత్ లైన్లు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించినట్లు తెలిపారు.

పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలపడం ద్వారా భూసారం పెరిగి నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని రైతులకు సూచించినట్లు తెలిపారు. ఎవరైనా వరి కొయ్యలను తగలబెట్టి ప్రమాదాలకు కారణమైతే సంబంధిత వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించినట్లు తెలిపారు.

రైతులు బాధ్యతాయుతంగా వ్యవహరించి వ్యవసాయాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించాలని అధికారులు పిలుపునిచ్చినట్లు తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News