Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 01:03 AM

వరి కొయ్యలను కాల్చొద్దు.. చట్టపరమైన చర్యలు తప్పవు: కలెక్టర్, ఎస్పీ

వరి కొయ్యలను కాల్చొద్దు.. చట్టపరమైన చర్యలు తప్పవు: కలెక్టర్, ఎస్పీ

వరి కొయ్యలను కాల్చొద్దు.. చట్టపరమైన చర్యలు తప్పవు: కలెక్టర్, ఎస్పీ
May 30, 2026 05:37 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

- వ్యవసాయాన్ని కాపాడుకుందాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం


సూర్యాపేట మండలం కాసారాబాద్ గ్రామంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహ పాల్గొని వరి కొయ్యలను తగలబెట్టవద్దని రైతులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వరి పంట కోత అనంతరం పొలాల్లో మిగిలే కొయ్యలను కాల్చడం వల్ల భూమి సహజ సారవంతత దెబ్బతింటుందని, నేలలోని సూక్ష్మజీవులు నశించి పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుందని వివరించినట్లు తెలిపారు.

వరి కొయ్యల దహనం కారణంగా రైతులు ఎరువులపై అధిక వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్లు తెలిపారు. అలాగే సమీపంలోని చెట్లు, వ్యవసాయ పరికరాలు, విద్యుత్ లైన్లు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించినట్లు తెలిపారు.

పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలపడం ద్వారా భూసారం పెరిగి నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని రైతులకు సూచించినట్లు తెలిపారు. ఎవరైనా వరి కొయ్యలను తగలబెట్టి ప్రమాదాలకు కారణమైతే సంబంధిత వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించినట్లు తెలిపారు.

రైతులు బాధ్యతాయుతంగా వ్యవహరించి వ్యవసాయాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించాలని అధికారులు పిలుపునిచ్చినట్లు తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News