మహిళా వారోత్సవాల్లో భాగంగా స్నేహ బాలికల సంఘ సభ్యులకు మోడల్ పార్లమెంట్ నిర్వహణ
మహిళా వారోత్సవాల్లో భాగంగా స్నేహ బాలికల సంఘ సభ్యులకు మోడల్ పార్లమెంట్ నిర్వహణ
Krishna
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్నేహ (బాలికల) సంఘాల సభ్యులకు మోడల్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, శాసనసభల పనితీరు, చట్టాల రూపకల్పన ప్రక్రియపై అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలికలు పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, సభాపతుల పాత్రలను పోషిస్తూ వివిధ అంశాలపై చర్చలు జరిపారు. బిల్లులను ప్రవేశపెట్టడం, వాటిపై చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి పార్లమెంటరీ విధానాలను అనుసరిస్తూ నిజమైన పార్లమెంట్ సమావేశాల అనుభూతిని పొందారు. ఈ కార్యక్రమం ద్వారా చట్టాలు ఎలా రూపొందుతాయి, ప్రజా సమస్యలు ఎలా చర్చకు వస్తాయి, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే అంశాలపై ప్రత్యక్ష అవగాహన పొందడంతో పాటు నాయకత్వ లక్షణాలు, ప్రసంగ నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచన, నిర్ణయ సామర్థ్యాలు పెంపొందించుకునే అవకాశం కలిగింది. ప్రజాస్వామ్య విలువలు, సహనం, సమిష్టి నిర్ణయాల ప్రాముఖ్యతను అర్థం చేసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, విద్యాశాఖ, పోలీసు శాఖ అధికారులు, జిల్లా మరియు మండల స్థాయి సిబ్బంది, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి