నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఏడు గురువారాలు – ఏడు ఆదివారాల జాతర మహోత్సవాల్లో భాగంగా రేపు నిర్వహించనున్న ఆరవ ఆదివారం జాతరకు ప్రముఖ భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ హాజరవుతున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శివరుద్రప్ప తెలిపారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ఛాంపియన్షిప్లలో విజేతగా నిలిచిన నైనా జైస్వాల్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ రంగంలో భారతదేశానికి విశిష్ట గుర్తింపు తీసుకువచ్చి దేశ ఖ్యాతిని పెంచారని పేర్కొన్నారు. ఆమె రాకతో జాతర మహోత్సవాలకు మరింత ప్రత్యేకత చేకూరనుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం చేసుకొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
PRINT TIME: August 06, 2026 10:56 PM
రేపు నల్లపోచమ్మ జాతరకు అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ రాక
రేపు నల్లపోచమ్మ జాతరకు అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ రాక
30-05-2026
138 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఏడు గురువారాలు – ఏడు ఆదివారాల జాతర మహోత్సవాల్లో భాగంగా రేపు నిర్వహించనున్న ఆరవ ఆదివారం జాతరకు ప్రముఖ భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ హాజరవుతున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శివరుద్రప్ప తెలిపారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ఛాంపియన్షిప్లలో విజేతగా నిలిచిన నైనా జైస్వాల్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ రంగంలో భారతదేశానికి విశిష్ట గుర్తింపు తీసుకువచ్చి దేశ ఖ్యాతిని పెంచారని పేర్కొన్నారు. ఆమె రాకతో జాతర మహోత్సవాలకు మరింత ప్రత్యేకత చేకూరనుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం చేసుకొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి