Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:55 PM

సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ కే. లలితాదేవి బాధ్యతల స్వీకరణ

సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ కే. లలితాదేవి బాధ్యతల స్వీకరణ

సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ కే. లలితాదేవి బాధ్యతల స్వీకరణ
30-05-2026 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ కే. లలితాదేవి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గతంలో చార్మినార్ జోన్ డీఎంహెచ్‌ఓగా సేవలందించిన ఆమె, బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో ఆరోగ్య సేవల అభివృద్ధిపై చర్చించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, కార్యక్రమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రజలకు మెరుగైన వైద్య సేవల అందుబాటు, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా సిబ్బంది అందరూ కష్టపడి పనిచేస్తూ సమయపాలన పాటించాలని, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ పనితీరును మరింత మెరుగుపరుస్తూ సంగారెడ్డి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

Sthanikam

సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ కే. లలితాదేవి బాధ్యతల స్వీకరణ

Article Image

సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ కే. లలితాదేవి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గతంలో చార్మినార్ జోన్ డీఎంహెచ్‌ఓగా సేవలందించిన ఆమె, బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో ఆరోగ్య సేవల అభివృద్ధిపై చర్చించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, కార్యక్రమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రజలకు మెరుగైన వైద్య సేవల అందుబాటు, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా సిబ్బంది అందరూ కష్టపడి పనిచేస్తూ సమయపాలన పాటించాలని, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ పనితీరును మరింత మెరుగుపరుస్తూ సంగారెడ్డి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News