Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 02:11 AM

ఉద్యమకారులారా.. చలో బషీర్‌బాగ్.జోగు అంజన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉద్యమకారుల ఫోరం

ఉద్యమకారులారా.. చలో బషీర్‌బాగ్.జోగు అంజన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉద్యమకారుల ఫోరం

ఉద్యమకారులారా.. చలో బషీర్‌బాగ్.జోగు అంజన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉద్యమకారుల ఫోరం
May 30, 2026 07:35 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నేటి ప్రతినిధుల సదస్సుకు భారీగా తరలిరావాలని పిలుపు

తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నేడు నిర్వహించనున్న ఉద్యమకారుల ప్రతినిధుల సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు, నాయకులు, కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పిలుపునిచ్చారు.

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల పదాధికారులు, తొలి దశ, మలిదశ ఉద్యమకారులు, మహిళా నాయకులు, కళాకారులు ఈ సమావేశంలో పాల్గొనాలని కోరారు.

సదస్సుకు కేకే కమిటీ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కేకే కమిటీని ఏర్పాటు చేసినందుకు స్వాగతం తెలుపుతూ, కృతజ్ఞతాభావంతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉద్యమకారుల కోసం రూ.12 వేల కోట్లతో ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 250 గజాల ఇంటి స్థలంతో గృహ నిర్మాణం, నెలకు రూ.25 వేల పెన్షన్, ఉద్యమ సమయంలో మరణించిన వారి కుటుంబాలకు, వికలాంగులైన ఉద్యమకారులకు ప్రత్యేక సహాయం అందించాలని కోరారు.

అర్హులైన ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, కేకే కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా ఉద్యమకారులకు తక్షణ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News