Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:55 AM

కార్మిక హక్కుల కోసం సీఐటీయూ పోరాటాలు ఆదర్శం. 56వ ఆవిర్భావ దినోత్సవంలో మాయ కృష్ణ

కార్మిక హక్కుల కోసం సీఐటీయూ పోరాటాలు ఆదర్శం. 56వ ఆవిర్భావ దినోత్సవంలో మాయ కృష్ణ

కార్మిక హక్కుల కోసం సీఐటీయూ పోరాటాలు ఆదర్శం. 56వ ఆవిర్భావ దినోత్సవంలో మాయ కృష్ణ
30-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కార్మిక, కూలీ వర్గాల హక్కుల సాధన కోసం సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) గత 56 ఏళ్లుగా నిరంతర పోరాటాలు సాగిస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ అన్నారు. సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సీఐటీయూ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.

ఎనిమిది గంటల పనిదినం, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత వంటి అనేక కార్మిక హక్కులు ఉద్యమాల ద్వారానే సాధ్యమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు.

అసంఘటిత రంగ కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. కార్మికుల ఐక్యతే వారి బలమని, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరింత సంఘటితంగా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.

నూతన లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కోడ్లు కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్నాయని ఆరోపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కనీస వేతనాల్లో శాస్త్రీయత లోపించిందని, పెరిగిన నిత్యావసర ధరలు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని వేతనాలను పునర్నిర్ణయించాలని కోరారు.

అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ భువనగిరి పట్టణ కన్వీనర్ గంధమల్ల మాతయ్య, ఆనగంటి వెంకటేష్, మల్లారెడ్డి, కొలుపుల నాగరాజు, ఎల్లేష్, శంకర్, వెంకటరత్నమ్మ, బిక్షపతి, దండు నరసింహ, మైసయ్య, రాములు, సుధాకర్, కాంతమ్మ, భాస్కర్‌తో పాటు వివిధ యూనియన్ల నాయకులు, కార్మికులు, సీఐటీయూ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

కార్మిక హక్కుల కోసం సీఐటీయూ పోరాటాలు ఆదర్శం. 56వ ఆవిర్భావ దినోత్సవంలో మాయ కృష్ణ

Article Image

కార్మిక, కూలీ వర్గాల హక్కుల సాధన కోసం సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) గత 56 ఏళ్లుగా నిరంతర పోరాటాలు సాగిస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ అన్నారు. సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సీఐటీయూ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.

ఎనిమిది గంటల పనిదినం, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత వంటి అనేక కార్మిక హక్కులు ఉద్యమాల ద్వారానే సాధ్యమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు.

అసంఘటిత రంగ కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. కార్మికుల ఐక్యతే వారి బలమని, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరింత సంఘటితంగా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.

నూతన లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కోడ్లు కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్నాయని ఆరోపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కనీస వేతనాల్లో శాస్త్రీయత లోపించిందని, పెరిగిన నిత్యావసర ధరలు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని వేతనాలను పునర్నిర్ణయించాలని కోరారు.

అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ భువనగిరి పట్టణ కన్వీనర్ గంధమల్ల మాతయ్య, ఆనగంటి వెంకటేష్, మల్లారెడ్డి, కొలుపుల నాగరాజు, ఎల్లేష్, శంకర్, వెంకటరత్నమ్మ, బిక్షపతి, దండు నరసింహ, మైసయ్య, రాములు, సుధాకర్, కాంతమ్మ, భాస్కర్‌తో పాటు వివిధ యూనియన్ల నాయకులు, కార్మికులు, సీఐటీయూ కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News