Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 01:05 AM

సంగటన్ సృజన్ అభియాన్‌తో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం: ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

సంగటన్ సృజన్ అభియాన్‌తో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం: ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

సంగటన్ సృజన్ అభియాన్‌తో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం: ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
May 30, 2026 05:21 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన "సంగటన్ సృజన్ అభియాన్" కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, గ్రామ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల విశ్వాసాన్ని పొందే దిశగా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం సూచించిన మార్గదర్శకాల మేరకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News