నాగోల్, సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్గా నియమితులైన జీ. రాజు గురువారం పెద్ద అంబర్పేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం డిప్యూటీ కమిషనర్ జీ. రాజు మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసే దిశగా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని పని చేస్తానన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని నూతన డిప్యూటీ కమిషనర్కు శుభాకాంక్షలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి