Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:57 PM

లక్కారం వద్ద ఘోర ప్రమాదం: లారీ కిందపడి వృద్ధురాలు దుర్మరణం!

లక్కారం వద్ద ఘోర ప్రమాదం: లారీ కిందపడి వృద్ధురాలు దుర్మరణం!

లక్కారం వద్ద ఘోర ప్రమాదం: లారీ కిందపడి వృద్ధురాలు దుర్మరణం!
May 19, 2026 08:28 PM 433 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి ఢీకొట్టిన అశోక్ లేలాండ్ వాహనం

​* అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన టైలర్ అనసూయ.. కుమారుడికి గాయాలు

​మండల పరిధిలోని లక్కారం గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే దుర్మరణం చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...

డి.నాగారం గ్రామానికి చెందిన ఏనుగు అనసూయ (66) (భర్త దివంగత అంజిరెడ్డి) వృత్తిరీత్యా టైలర్‌గా పనిచేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆమె తన కుమారుడు ఏనుగు వెంకట్ రెడ్డితో కలిసి ‘ప్యాషన్ ప్రో’ బైక్ (TG 30 A 7507) పై చౌటుప్పల్ కూరగాయల మార్కెట్‌కు వచ్చింది. మార్కెట్‌లో సరుకులు కొనుగోలు చేసిన అనంతరం ఇద్దరూ కలిసి తిరిగి బైక్‌పై డి.నాగారం బయలుదేరారు.సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో వారి బైక్ జాతీయ రహదారి 65 (NH 65) పై లక్కారం గ్రామ పరిధిలోని టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుంది. అదే సమయంలో చౌటుప్పల్ వైపు నుండి వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం (TS 05 UC 0018) డ్రైవర్ తన వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి బైక్‌ను వెనుక నుండి బలంగా ఢీకొట్టాడు.​ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న తల్లి, కొడుకు ఇద్దరూ కిందపడిపోయారు. దురదృష్టవశాత్తూ కిందపడిన అనసూయ తలపై నుండి సదరు అశోక్ లేలాండ్ వాహనం దూసుకెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బైక్ నడుపుతున్న వెంకట్ రెడ్డికి కుడి మోచేతికి, కుడికాలి బొటనవేలికి రక్తగాయాలయ్యాయి .ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు బాధితులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి మరో కుమారుడు ఏనుగు లింగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News