Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 02:09 AM

వయోవృద్ధులకు చట్టాలపై అవగాహన

వయోవృద్ధులకు చట్టాలపై అవగాహన

వయోవృద్ధులకు చట్టాలపై అవగాహన
May 30, 2026 09:22 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జాతీయ న్యాయ సేవల అధికార సంస్థ పథకాల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బీబీనగర్‌లోని ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ కేంద్రంలో శనివారం చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

జిల్లా న్యాయ సేవల అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయ సేవల సంస్థ న్యాయవాది ఎస్. సాయి శ్రీనివాస్ పాల్గొని వయోవృద్ధుల సంక్షేమ చట్టం, చట్టం ప్రకారం వారికి కల్పించిన హక్కులపై వివరించారు. న్యాయ సేవల సంస్థల ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని, 15100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సేవలు పొందే అవకాశం ఉందని తెలిపారు.

రెవెన్యూ డివిజన్ అధికారి చైర్‌పర్సన్‌గా వ్యవహరించే వయోవృద్ధుల ట్రిబ్యునల్ ద్వారా వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. జాగృతి పథకం ద్వారా చట్టాలు, హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, ఆశ పథకం ద్వారా బాల్య వివాహాల నివారణకు న్యాయ సేవలు అందిస్తున్నామని వివరించారు.

అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుమంత్ వయోవృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి వైద్య సూచనలు అందజేశారు.

కార్యక్రమంలో ఆశ్రమ భవన కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, కార్యదర్శి కె. లింగారెడ్డి, ఇన్‌చార్జి మధుసూదన్‌రెడ్డి, వయోవృద్ధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News