Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:06 AM

రాంగ్‌రూట్ వాహనం ఢీకొని పెట్రోల్ బంక్ ఉద్యోగి మృతి

రాంగ్‌రూట్ వాహనం ఢీకొని పెట్రోల్ బంక్ ఉద్యోగి మృతి

రాంగ్‌రూట్ వాహనం ఢీకొని పెట్రోల్ బంక్ ఉద్యోగి మృతి
17-05-2026 359 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాంగ్‌రూట్‌లో వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో పెట్రోల్ బంక్ ఉద్యోగి మృతి చెందిన ఘటన చౌటుప్పల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..చౌటుప్పల్ కు చెందిన అన్నేబోయిన మల్లేష్ (45) హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. శనివారం డ్యూటీ ముగించుకొని తన సీబీజెడ్ బైక్‌ (ఏపీ13 ఎం 4987)పై తూప్రాన్‌పేట్ నుంచి చౌటుప్పల్‌లోని ఇంటికి బయలుదేరాడు.మార్గమధ్యలో ఖైతాపురం స్టేజి సమీపంలోని ఎన్హెచ్-65 హైవేపై ఉదయం సుమారు 10:45 గంటల సమయంలో రాంగ్‌రూట్‌లో అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లేష్ రోడ్డుపై పడిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం చింతలకుంటలోని నాసా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 1:47 గంటలకు మల్లేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతుడి భార్య అన్నేబోయిన అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధకుమార్ తెలిపారు.

Sthanikam

రాంగ్‌రూట్ వాహనం ఢీకొని పెట్రోల్ బంక్ ఉద్యోగి మృతి

Article Image

రాంగ్‌రూట్‌లో వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో పెట్రోల్ బంక్ ఉద్యోగి మృతి చెందిన ఘటన చౌటుప్పల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..చౌటుప్పల్ కు చెందిన అన్నేబోయిన మల్లేష్ (45) హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. శనివారం డ్యూటీ ముగించుకొని తన సీబీజెడ్ బైక్‌ (ఏపీ13 ఎం 4987)పై తూప్రాన్‌పేట్ నుంచి చౌటుప్పల్‌లోని ఇంటికి బయలుదేరాడు.మార్గమధ్యలో ఖైతాపురం స్టేజి సమీపంలోని ఎన్హెచ్-65 హైవేపై ఉదయం సుమారు 10:45 గంటల సమయంలో రాంగ్‌రూట్‌లో అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లేష్ రోడ్డుపై పడిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం చింతలకుంటలోని నాసా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 1:47 గంటలకు మల్లేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతుడి భార్య అన్నేబోయిన అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధకుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News