రాంగ్రూట్ వాహనం ఢీకొని పెట్రోల్ బంక్ ఉద్యోగి మృతి
రాంగ్రూట్ వాహనం ఢీకొని పెట్రోల్ బంక్ ఉద్యోగి మృతి
K.RAVI
రాంగ్రూట్లో వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో పెట్రోల్ బంక్ ఉద్యోగి మృతి చెందిన ఘటన చౌటుప్పల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..చౌటుప్పల్ కు చెందిన అన్నేబోయిన మల్లేష్ (45) హెచ్పీ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. శనివారం డ్యూటీ ముగించుకొని తన సీబీజెడ్ బైక్ (ఏపీ13 ఎం 4987)పై తూప్రాన్పేట్ నుంచి చౌటుప్పల్లోని ఇంటికి బయలుదేరాడు.మార్గమధ్యలో ఖైతాపురం స్టేజి సమీపంలోని ఎన్హెచ్-65 హైవేపై ఉదయం సుమారు 10:45 గంటల సమయంలో రాంగ్రూట్లో అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లేష్ రోడ్డుపై పడిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం చింతలకుంటలోని నాసా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 1:47 గంటలకు మల్లేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతుడి భార్య అన్నేబోయిన అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధకుమార్ తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి