Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:56 AM

భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు అవసరం. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు అవసరం. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు అవసరం.   అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
30-05-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలో భూగర్భ జలాల లభ్యతను పెంచేందుకు నీటి సంరక్షణ చర్యలు ముమ్మరం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సూచించారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 2025–26 నీటి సంవత్సరానికి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా భూగర్భ జలాల అంచనా కమిటీ తొలి సమావేశం శనివారం ఆయన అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్, అటవీ, నీటిపారుదల, ప్రణాళిక శాఖల అధికారులతో భూగర్భ జలాల అంచనా ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. 2025–26 సంవత్సరానికి అవసరమైన మౌలిక సమాచారాన్ని శాఖలు సమయానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో సాధారణం కంటే 65 శాతం అధిక వర్షపాతం నమోదైనప్పటికీ జనవరి నుంచే నీటి సమస్యలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. భూగర్భ జలాల లభ్యతకు అనుగుణంగా రైతులు పంటల ఎంపిక చేసుకుంటే నష్టాలను నివారించవచ్చన్నారు. నవంబర్‌లో భూగర్భ జలాలు మూడు మీటర్ల లోతులో, మే నెలలో ఐదు మీటర్ల లోతులో ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

అత్యధిక భూగర్భ జల వినియోగ ప్రాంతాల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు పంట మార్పిడిని ప్రోత్సహించాలని సూచించారు. రెండో పంటగా బోర్ల కింద వరి సాగును తగ్గించాలని రైతులకు సూచించారు.

సమావేశంలో భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూగర్భ జలాల అంచనా విధానం, జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులను వివరించారు. అనంతరం 2024–25 సంవత్సరానికి సంబంధించిన భూగర్భ జలాల అంచనా నివేదికను జిల్లా కమిటీ ఆవిష్కరించింది.

Sthanikam

భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు అవసరం. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

జిల్లాలో భూగర్భ జలాల లభ్యతను పెంచేందుకు నీటి సంరక్షణ చర్యలు ముమ్మరం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సూచించారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 2025–26 నీటి సంవత్సరానికి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా భూగర్భ జలాల అంచనా కమిటీ తొలి సమావేశం శనివారం ఆయన అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్, అటవీ, నీటిపారుదల, ప్రణాళిక శాఖల అధికారులతో భూగర్భ జలాల అంచనా ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. 2025–26 సంవత్సరానికి అవసరమైన మౌలిక సమాచారాన్ని శాఖలు సమయానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో సాధారణం కంటే 65 శాతం అధిక వర్షపాతం నమోదైనప్పటికీ జనవరి నుంచే నీటి సమస్యలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. భూగర్భ జలాల లభ్యతకు అనుగుణంగా రైతులు పంటల ఎంపిక చేసుకుంటే నష్టాలను నివారించవచ్చన్నారు. నవంబర్‌లో భూగర్భ జలాలు మూడు మీటర్ల లోతులో, మే నెలలో ఐదు మీటర్ల లోతులో ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

అత్యధిక భూగర్భ జల వినియోగ ప్రాంతాల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు పంట మార్పిడిని ప్రోత్సహించాలని సూచించారు. రెండో పంటగా బోర్ల కింద వరి సాగును తగ్గించాలని రైతులకు సూచించారు.

సమావేశంలో భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూగర్భ జలాల అంచనా విధానం, జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులను వివరించారు. అనంతరం 2024–25 సంవత్సరానికి సంబంధించిన భూగర్భ జలాల అంచనా నివేదికను జిల్లా కమిటీ ఆవిష్కరించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News