డ్రైనేజీకి దారి ఏది..? బాలాజీనగర్లో మురుగు నీటితో ప్రజల ఇబ్బందులు
డ్రైనేజీకి దారి ఏది..? బాలాజీనగర్లో మురుగు నీటితో ప్రజల ఇబ్బందులు
Prakash
సోమందేపల్లి, మే 30: మండల కేంద్రంలోని బాలాజీనగర్లో డ్రైనేజీ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా మందలపల్లి నాగేంద్ర ఇంటి సందులో కాలువలు సరిగా లేకపోవడంతో పై ఇళ్ల నుంచి వస్తున్న మురుగు నీరు కాలనీ చివర నివసించే కుటుంబాల ఇళ్లలోకి చేరుతోంది.
⚠️ రోడ్డుపై నిల్వ ఉన్న మురుగు నీటితో దుర్వాసన వ్యాపిస్తోంది.
???? దోమలు, ఈగలు పెరిగి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
????️ అకాల వర్షాలు పడితే మురుగు నీటితో పాటు చెత్తాచెదారం ఇళ్లలోకి చేరుతోంది.
స్థానికులు చెబుతున్నదేమిటంటే.. గతంలో అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా “శాశ్వత పరిష్కారం చేస్తాం” అని చెప్పి ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
???? ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని బాలాజీనగర్ వాసులు కోరుతున్నారు.
చూడాలి మరి… అధికారులు, నాయకులు ఈ సమస్యపై ఎలా స్పందిస్తారో..!















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి