ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి.డాక్టర్ ఎన్. అశోక్
ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి.డాక్టర్ ఎన్. అశోక్
Editor Desk
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు డాక్టర్ ఎన్. అశోక్ కోరారు. ఈ మేరకు కేకే కమిటీ సభ్యుడు మోతే శోభన్రెడ్డిని కలిసి ఉద్యమకారుల సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేలాది మంది ఉద్యమకారులు చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందన్నారు. అయితే ఉద్యమకారుల ఆత్మగౌరవానికి సంబంధించిన అనేక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆట, పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన బతుకమ్మ తల్లి కళాబృందం సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే మలిదశ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఆరోగ్య భద్రత కార్డులు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధులకు అందిస్తున్న తరహాలో ప్రత్యేక రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని గుర్తించి న్యాయం చేయాలని మోతే శోభన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మోతే శోభన్రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి