ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దాసరి పాండు
ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దాసరి పాండు
Editor Desk
: సీఐటీయూ ఆధ్వర్యంలో జనగాం జిల్లా కేంద్రంలోని గ్లోరీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ నాలుగో రాష్ట్ర మహాసభలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండును రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ రైస్మిల్లులు, గోదాములు, మార్కెట్లు, గ్రామీణ ప్రాంతాలు, రైల్వే తదితర రంగాల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు.
పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచడం లేదని, కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, పెన్షన్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. విధి నిర్వహణలో ప్రమాదాలు జరిగిన సందర్భాల్లోనూ యాజమాన్యాలు బాధ్యత వహించకపోవడంతో హమాలీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను ఐక్యం చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని దాసరి పాండు పేర్కొన్నారు.– దాసరి పాండు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి