Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 02:10 AM

ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దాసరి పాండు

ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దాసరి పాండు

ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దాసరి పాండు
May 30, 2026 08:10 PM 7 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: సీఐటీయూ ఆధ్వర్యంలో జనగాం జిల్లా కేంద్రంలోని గ్లోరీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ నాలుగో రాష్ట్ర మహాసభలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండును రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ రైస్‌మిల్లులు, గోదాములు, మార్కెట్లు, గ్రామీణ ప్రాంతాలు, రైల్వే తదితర రంగాల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు.


పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచడం లేదని, కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, పెన్షన్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. విధి నిర్వహణలో ప్రమాదాలు జరిగిన సందర్భాల్లోనూ యాజమాన్యాలు బాధ్యత వహించకపోవడంతో హమాలీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.


హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను ఐక్యం చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని దాసరి పాండు పేర్కొన్నారు.– దాసరి పాండు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News