Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:52 AM

ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దాసరి పాండు

ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దాసరి పాండు

ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దాసరి పాండు
30-05-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: సీఐటీయూ ఆధ్వర్యంలో జనగాం జిల్లా కేంద్రంలోని గ్లోరీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ నాలుగో రాష్ట్ర మహాసభలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండును రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ రైస్‌మిల్లులు, గోదాములు, మార్కెట్లు, గ్రామీణ ప్రాంతాలు, రైల్వే తదితర రంగాల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు.


పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచడం లేదని, కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, పెన్షన్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. విధి నిర్వహణలో ప్రమాదాలు జరిగిన సందర్భాల్లోనూ యాజమాన్యాలు బాధ్యత వహించకపోవడంతో హమాలీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.


హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను ఐక్యం చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని దాసరి పాండు పేర్కొన్నారు.– దాసరి పాండు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్

Sthanikam

ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దాసరి పాండు

Article Image

: సీఐటీయూ ఆధ్వర్యంలో జనగాం జిల్లా కేంద్రంలోని గ్లోరీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ నాలుగో రాష్ట్ర మహాసభలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండును రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ రైస్‌మిల్లులు, గోదాములు, మార్కెట్లు, గ్రామీణ ప్రాంతాలు, రైల్వే తదితర రంగాల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు.


పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచడం లేదని, కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, పెన్షన్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. విధి నిర్వహణలో ప్రమాదాలు జరిగిన సందర్భాల్లోనూ యాజమాన్యాలు బాధ్యత వహించకపోవడంతో హమాలీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.


హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను ఐక్యం చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని దాసరి పాండు పేర్కొన్నారు.– దాసరి పాండు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News