PRINT TIME: May 31, 2026 11:56 AM
అర్ధరాత్రి నాఖా బందీ.. పోలీసుల విస్తృత తనిఖీలు 47 చెక్పోస్టులు.. 1500 మంది పోలీసులతో ప్రత్యేక డ్రైవ్
అర్ధరాత్రి నాఖా బందీ.. పోలీసుల విస్తృత తనిఖీలు 47 చెక్పోస్టులు.. 1500 మంది పోలీసులతో ప్రత్యేక డ్రైవ్
May 31, 2026 10:12 AM
18 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
అనుమానితులపై నిఘా.. వాహనాల క్షుణ్ణ పరిశీలన
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అర్ధరాత్రి నాఖా బందీ కార్యక్రమం నేరస్థులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల్లో కలవరాన్ని రేపింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు 47 చెక్పోస్టుల వద్ద 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది చేపట్టిన విస్తృత తనిఖీలతో అనుమానిత వాహనాలు, వ్యక్తులపై నిఘా మరింత బలోపేతమైంది.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు. నాఖా బందీ ద్వారా నేరస్తుల కదలికలను అడ్డుకోవడంతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ స్వయంగా తనిఖీలను పర్యవేక్షించడం పోలీసు యంత్రాంగం అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచింది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి