Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణలో అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 03:57 AM

నెంబర్ ప్లేట్లు లేని 11 వాహనాలు సీజ్ నార్కెట్‌పల్లిలో పోలీసుల ప్రత్యేక తనిఖీలు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నెంబర్ ప్లేట్లు లేని 11 వాహనాలు సీజ్ నార్కెట్‌పల్లిలో పోలీసుల ప్రత్యేక తనిఖీలు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

 నెంబర్ ప్లేట్లు లేని 11 వాహనాలు సీజ్ నార్కెట్‌పల్లిలో పోలీసుల ప్రత్యేక తనిఖీలు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
May 31, 2026 02:59 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కెట్‌పల్లి, మే 30: నెంబర్ ప్లేట్లు లేకుండా రోడ్లపై సంచరిస్తున్న వాహనాలపై నార్కెట్‌పల్లి పోలీసులు ఉక్కుపాదం మోపారు. పట్టణ పరిధిలో శనివారం నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా సంచరిస్తున్న 11 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు.పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న ద్విచక్ర, ఇతర వాహనాలను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంబంధిత వాహన యజమానులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా నార్కెట్‌పల్లి ఎస్సై విష్ణు మాట్లాడుతూ, ప్రతి వాహన యజమాని తమ వాహనాలకు చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.రోడ్డు భద్రత, నేర నియంత్రణ దృష్ట్యా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు భవిష్యత్తులో కూడా నిరంతరంగా కొనసాగుతాయని ఎస్సై తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News