వేసవి సెలవులు జూన్ 10 వరకు పొడిగించాలి. ఓయూ రిజిస్ట్రార్కు టీజీసీటీఏ వినతి
వేసవి సెలవులు జూన్ 10 వరకు పొడిగించాలి. ఓయూ రిజిస్ట్రార్కు టీజీసీటీఏ వినతి
Editor Desk
హైదరాబాద్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు వేసవి సెలవులను జూన్ 10వ తేదీ వరకు పొడిగించాలని తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీటీఏ) ఓయూ సెక్రటరీ డాక్టర్ చింతల రాకేష్ భవాని కోరారు.
ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, వీసీ ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్లను కలిసి వినతిపత్రం అందజేశారు. జనగణన విధులు ఇంకా కొనసాగుతుండటం, ప్రజాపాలన కార్యక్రమాల్లో అధ్యాపకులు పాల్గొంటుండటం, రాష్ట్రంలో తీవ్ర ఎండలు నెలకొన్న నేపథ్యంలో సెలవులను పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ అంశంపై రిజిస్ట్రార్, వీసీ ఓఎస్డీలు సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ రాకేష్ భవాని తెలిపారు. అలాగే అసోసియేషన్కు సంబంధించిన పలు సమస్యలు, డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్లగా వాటిపైనా సానుకూల స్పందన లభించిందన్నారు.
ఈ కార్యక్రమంలో టీజీసీటీఏ ఈసీ సభ్యుడు డాక్టర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి