Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:08 AM

వేసవి సెలవులకు ముగింపు.. నేటి నుంచే ఇంటర్ బాట!

వేసవి సెలవులకు ముగింపు.. నేటి నుంచే ఇంటర్ బాట!

వేసవి సెలవులకు ముగింపు.. నేటి నుంచే ఇంటర్ బాట!
31-05-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

హైదరాబాద్,

దాదాపు నెలరోజులుగా కొనసాగిన వేసవి సెలవులకు నేటితో ముగింపు పలుకుతూ తెలంగాణలో ఇంటర్మీడియట్ కళాశాలలు సోమవారం నుంచి తిరిగి సందడి చేయనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు జూన్ 1 నుంచే తరగతులు ప్రారంభమవుతున్నాయి. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమయ్యారు.

ఇంటర్ బోర్డు ఇప్పటికే కళాశాలల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయగా, హాజరు, సిలబస్ అమలు, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని యాజమాన్యాలకు సూచించింది. తొలి రోజు నుంచే బోధన ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విద్యాసంస్థలకు సెలవులు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులను జూన్ 6 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో తెలంగాణలో విద్యార్థులు తరగతి గదుల్లోకి అడుగుపెడుతుండగా, ఏపీలోని విద్యార్థులకు మరో వారం రోజుల విశ్రాంతి లభించనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు, విద్యా క్యాలెండర్ల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Sthanikam

వేసవి సెలవులకు ముగింపు.. నేటి నుంచే ఇంటర్ బాట!

Article Image

హైదరాబాద్,

దాదాపు నెలరోజులుగా కొనసాగిన వేసవి సెలవులకు నేటితో ముగింపు పలుకుతూ తెలంగాణలో ఇంటర్మీడియట్ కళాశాలలు సోమవారం నుంచి తిరిగి సందడి చేయనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు జూన్ 1 నుంచే తరగతులు ప్రారంభమవుతున్నాయి. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమయ్యారు.

ఇంటర్ బోర్డు ఇప్పటికే కళాశాలల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయగా, హాజరు, సిలబస్ అమలు, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని యాజమాన్యాలకు సూచించింది. తొలి రోజు నుంచే బోధన ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విద్యాసంస్థలకు సెలవులు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులను జూన్ 6 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో తెలంగాణలో విద్యార్థులు తరగతి గదుల్లోకి అడుగుపెడుతుండగా, ఏపీలోని విద్యార్థులకు మరో వారం రోజుల విశ్రాంతి లభించనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు, విద్యా క్యాలెండర్ల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News