వేసవి సెలవులకు ముగింపు.. నేటి నుంచే ఇంటర్ బాట!
వేసవి సెలవులకు ముగింపు.. నేటి నుంచే ఇంటర్ బాట!
Komidala Mahender reddy
హైదరాబాద్,
దాదాపు నెలరోజులుగా కొనసాగిన వేసవి సెలవులకు నేటితో ముగింపు పలుకుతూ తెలంగాణలో ఇంటర్మీడియట్ కళాశాలలు సోమవారం నుంచి తిరిగి సందడి చేయనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు జూన్ 1 నుంచే తరగతులు ప్రారంభమవుతున్నాయి. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమయ్యారు.
ఇంటర్ బోర్డు ఇప్పటికే కళాశాలల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయగా, హాజరు, సిలబస్ అమలు, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని యాజమాన్యాలకు సూచించింది. తొలి రోజు నుంచే బోధన ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం విద్యాసంస్థలకు సెలవులు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులను జూన్ 6 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో తెలంగాణలో విద్యార్థులు తరగతి గదుల్లోకి అడుగుపెడుతుండగా, ఏపీలోని విద్యార్థులకు మరో వారం రోజుల విశ్రాంతి లభించనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు, విద్యా క్యాలెండర్ల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి