Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:11 AM

ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
31-05-2026 165 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* ముమ్మరంగా వలిగొండ బీటీ రోడ్డు నిర్మాణ పనులు

* ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతో శాశ్వత పరిష్కారం

మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. స్థానిక వలిగొండ రోడ్డులో అధ్వాన్నంగా మారిన రహదారికి ఆదివారం ఆమె చొరవతో మరమ్మతు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి కోర్టుకు వెళ్లే దారి వరకు చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు.​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. గతంలో ఈ వలిగొండ రోడ్డుకు రెండుసార్లు మరమ్మతులు చేసినప్పటికీ, భారీ వాహనాల రాకపోకల వల్ల రోడ్డు మళ్లీ పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారిందన్నారు. దీనివల్ల వాహనదారులు, స్థానికులు పడుతున్న ఇబ్బందులను గమనించి తక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సహకారంతో ఈ రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. నిర్మాణ కాంట్రాక్టర్‌తో మాట్లాడాం. మరో 15 రోజుల్లో నాణ్యమైన బీటీ రోడ్డు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. గత కొంతకాలంగా గుంతల రోడ్డుతో నరకం చూస్తున్న తమకు, చైర్‌పర్సన్ చొరవతో మళ్లీ రోడ్డు పనులు ప్రారంభం కావడం పట్ల స్థానిక ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

Article Image

​* ముమ్మరంగా వలిగొండ బీటీ రోడ్డు నిర్మాణ పనులు

* ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతో శాశ్వత పరిష్కారం

మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. స్థానిక వలిగొండ రోడ్డులో అధ్వాన్నంగా మారిన రహదారికి ఆదివారం ఆమె చొరవతో మరమ్మతు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి కోర్టుకు వెళ్లే దారి వరకు చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు.​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. గతంలో ఈ వలిగొండ రోడ్డుకు రెండుసార్లు మరమ్మతులు చేసినప్పటికీ, భారీ వాహనాల రాకపోకల వల్ల రోడ్డు మళ్లీ పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారిందన్నారు. దీనివల్ల వాహనదారులు, స్థానికులు పడుతున్న ఇబ్బందులను గమనించి తక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సహకారంతో ఈ రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. నిర్మాణ కాంట్రాక్టర్‌తో మాట్లాడాం. మరో 15 రోజుల్లో నాణ్యమైన బీటీ రోడ్డు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. గత కొంతకాలంగా గుంతల రోడ్డుతో నరకం చూస్తున్న తమకు, చైర్‌పర్సన్ చొరవతో మళ్లీ రోడ్డు పనులు ప్రారంభం కావడం పట్ల స్థానిక ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News