తుమ్మలగూడెం సబ్స్టేషన్లో ఘనంగా మే డే వేడుకలు. కార్మికుల సంక్షేమానికి 1104 యూనియన్ కృషి
తుమ్మలగూడెం సబ్స్టేషన్లో ఘనంగా మే డే వేడుకలు. కార్మికుల సంక్షేమానికి 1104 యూనియన్ కృషి
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట సబ్డివిజన్ పరిధిలోని తుమ్మలగూడెం సబ్స్టేషన్లో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–1104 ఆధ్వర్యంలో మే డే (కార్మిక దినోత్సవ) వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షుడు ఆలే రమేష్, కార్యదర్శి గంగుల సోమేశ్వర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–1104 నిరంతరం పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో డిస్కం నాయకులు పలుగుల శ్రీధర్, యాదాద్రి జిల్లా యూనియన్ నాయకుడు తిరుమలేష్, చౌటుప్పల్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి, సబ్డివిజన్ నాయకుడు నల్ల రాములు, రామన్నపేట సెక్షన్ నాయకుడు చాంద్ పాషా, సీనియర్ నాయకులు సత్తిరెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్, ఎం.యాదయ్య, కె.మహేష్ గౌడ్, కంచ యాదయ్య, రెడ్బస్ నవీన్, జింకల సైదులు, ఉట్కూరు సాయికుమార్, కందాల దేవేందర్, వర్కాల గోపాల్, బొడ్డుపల్లి బాలకృష్ణ, బొడ్డుపల్లి రాజు, బోనగిరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి