Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:51 AM

చలకాని వెంకట్ యాదవ్‌కు ఆత్మీయ సన్మానం.

చలకాని వెంకట్ యాదవ్‌కు ఆత్మీయ సన్మానం.

చలకాని వెంకట్ యాదవ్‌కు ఆత్మీయ సన్మానం.
31-05-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా విజయం సాధించిన చలకాని వెంకట్ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహాసభ రామన్నపేట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మల్లికార్జున ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి యాదవ సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అఖిల భారత యాదవ మహాసభ రామన్నపేట కమిటీ అధ్యక్షుడు తిరుగుడు మల్లికార్జున్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదవులు రాజకీయ చైతన్యంతో ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని అన్నారు.

సన్మాన గ్రహీత చలకాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ యాదవులు ఐక్యతతో ముందుకు సాగాలని, గ్రామస్థాయిలో రాజకీయంగా ప్రభావవంతమైన పాత్ర పోషించాలని సూచించారు. ఎన్నికల సమయంలో సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఐక్యంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జంగిలి నర్సింహా, దుర్గయ్య, గోగు వెంకటేశ్వర్లు, సింగనబోయిన జంగయ్య, నీల ఐలయ్య, జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన అయోధ్యతో పాటు పలువురు యాదవ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

చలకాని వెంకట్ యాదవ్‌కు ఆత్మీయ సన్మానం.

Article Image

రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా విజయం సాధించిన చలకాని వెంకట్ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహాసభ రామన్నపేట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మల్లికార్జున ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి యాదవ సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అఖిల భారత యాదవ మహాసభ రామన్నపేట కమిటీ అధ్యక్షుడు తిరుగుడు మల్లికార్జున్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదవులు రాజకీయ చైతన్యంతో ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని అన్నారు.

సన్మాన గ్రహీత చలకాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ యాదవులు ఐక్యతతో ముందుకు సాగాలని, గ్రామస్థాయిలో రాజకీయంగా ప్రభావవంతమైన పాత్ర పోషించాలని సూచించారు. ఎన్నికల సమయంలో సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఐక్యంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జంగిలి నర్సింహా, దుర్గయ్య, గోగు వెంకటేశ్వర్లు, సింగనబోయిన జంగయ్య, నీల ఐలయ్య, జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన అయోధ్యతో పాటు పలువురు యాదవ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News