చలకాని వెంకట్ యాదవ్కు ఆత్మీయ సన్మానం.
చలకాని వెంకట్ యాదవ్కు ఆత్మీయ సన్మానం.
Editor Desk
రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా విజయం సాధించిన చలకాని వెంకట్ యాదవ్కు అఖిల భారత యాదవ మహాసభ రామన్నపేట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మల్లికార్జున ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి యాదవ సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అఖిల భారత యాదవ మహాసభ రామన్నపేట కమిటీ అధ్యక్షుడు తిరుగుడు మల్లికార్జున్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదవులు రాజకీయ చైతన్యంతో ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని అన్నారు.
సన్మాన గ్రహీత చలకాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ యాదవులు ఐక్యతతో ముందుకు సాగాలని, గ్రామస్థాయిలో రాజకీయంగా ప్రభావవంతమైన పాత్ర పోషించాలని సూచించారు. ఎన్నికల సమయంలో సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఐక్యంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జంగిలి నర్సింహా, దుర్గయ్య, గోగు వెంకటేశ్వర్లు, సింగనబోయిన జంగయ్య, నీల ఐలయ్య, జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన అయోధ్యతో పాటు పలువురు యాదవ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి