Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు ప్రజా పాలన వేదికగా రోడ్డు భద్రత సందేశం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 03:11 PM

వర్షాకాలానికి ముందే నాలాలపై చర్యలు. నకిరేకల్‌ను వరద ముప్పు నుంచి కాపాడాలి: దైద రవీందర్

వర్షాకాలానికి ముందే నాలాలపై చర్యలు. నకిరేకల్‌ను వరద ముప్పు నుంచి కాపాడాలి: దైద రవీందర్

వర్షాకాలానికి ముందే నాలాలపై చర్యలు. నకిరేకల్‌ను వరద ముప్పు నుంచి కాపాడాలి: దైద రవీందర్
June 10, 2026 01:59 PM 7 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్,:

వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నకిరేకల్ పట్టణంలోని నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, నాలాల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పట్టణాన్ని వరద ముప్పు నుంచి రక్షించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ అధికారులకు సూచించారు.

నకిరేకల్ పట్టణంలోని 17, 18, 19, 20 వార్డులకు సంబంధించి ముత్యాలమ్మ గుడి సమీపంలో నిర్వహించిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, గ్రామాలు–పట్టణాల అభివృద్ధి, పారదర్శక పరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారాలు అందించే అవకాశం కలుగుతోందని చెప్పారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, ఉపాధి వంటి రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.

ప్రజల సూచనలు, అవసరాలు, సమస్యలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాలాలను వెంటనే శుభ్రపరచడంతో పాటు ఆక్రమణలను అరికట్టాలని అధికారులను కోరారు. ముందస్తు చర్యలతో నకిరేకల్ మున్సిపాలిటీని వరద ముప్పు నుంచి రక్షించవచ్చని, ప్రాంత అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని దైద రవీందర్ అన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News