Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు ప్రజా పాలన వేదికగా రోడ్డు భద్రత సందేశం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 04:29 PM

గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలి. డీజీపీ, ఎస్పీకి డీవైఎఫ్‌ఐ వినతి

గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలి. డీజీపీ, ఎస్పీకి డీవైఎఫ్‌ఐ వినతి

గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలి.  డీజీపీ, ఎస్పీకి డీవైఎఫ్‌ఐ వినతి
June 10, 2026 03:05 PM 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల,

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ నాయకులు రాష్ట్ర డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాసరావు, నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌లకు వినతిపత్రం అందజేశారు.చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి విచ్చేసిన డీజీపీ, ఎస్పీలను డీవైఎఫ్‌ఐ ప్రతినిధులు కలిసి గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా, కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు.

సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, బ్యాంకింగ్ మోసాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం, సైబర్ నేరాలపై అప్రమత్తత పెంచడం సమాజం మొత్తం బాధ్యత అని మల్లం మహేష్ అన్నారు.

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు పంది నరేష్, నాయకులు ఆడెపు రమేష్, గోలి సాయికిరణ్, కూరాకుల బాలు తదితరులు పాల్గొన్నారు.



మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News