Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:53 AM

గంజాయి వినియోగదారులతో మొక్కల నాటటం . భువనగిరిలో పోలీసుల వినూత్న కార్యక్రమం

గంజాయి వినియోగదారులతో మొక్కల నాటటం . భువనగిరిలో పోలీసుల వినూత్న కార్యక్రమం

గంజాయి వినియోగదారులతో మొక్కల నాటటం .    భువనగిరిలో పోలీసుల వినూత్న కార్యక్రమం
10-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,:

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గంజాయి వినియోగదారులతో కలిసి మొక్కలు నాటే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా డ్రగ్స్, గంజాయి వినియోగదారుల్లో సామాజిక బాధ్యత పెంపొందించి, వారిలో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు తెలిపారు.

మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతో పాటు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం ద్వారా వారిలో పరివర్తన తీసుకురావాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను గుర్తుచేసే ప్రయత్నం చేశారు.

కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ డి. రాంప్రసాద్, భువనగిరి టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం. రమేష్, ఎస్‌ఐ కే. లక్ష్మీనరసయ్య, జిల్లా జనరల్ హాస్పిటల్ ఆర్‌ఎంఓ డాక్టర్ చక్రధర్, డీ-అడిక్షన్ సెంటర్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని పేర్కొన్నారు.



Sthanikam

గంజాయి వినియోగదారులతో మొక్కల నాటటం . భువనగిరిలో పోలీసుల వినూత్న కార్యక్రమం

Article Image

భువనగిరి,:

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గంజాయి వినియోగదారులతో కలిసి మొక్కలు నాటే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా డ్రగ్స్, గంజాయి వినియోగదారుల్లో సామాజిక బాధ్యత పెంపొందించి, వారిలో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు తెలిపారు.

మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతో పాటు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం ద్వారా వారిలో పరివర్తన తీసుకురావాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను గుర్తుచేసే ప్రయత్నం చేశారు.

కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ డి. రాంప్రసాద్, భువనగిరి టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం. రమేష్, ఎస్‌ఐ కే. లక్ష్మీనరసయ్య, జిల్లా జనరల్ హాస్పిటల్ ఆర్‌ఎంఓ డాక్టర్ చక్రధర్, డీ-అడిక్షన్ సెంటర్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని పేర్కొన్నారు.



మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News