గంజాయి వినియోగదారులతో మొక్కల నాటటం . భువనగిరిలో పోలీసుల వినూత్న కార్యక్రమం
గంజాయి వినియోగదారులతో మొక్కల నాటటం . భువనగిరిలో పోలీసుల వినూత్న కార్యక్రమం
Editor Desk
భువనగిరి,:
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గంజాయి వినియోగదారులతో కలిసి మొక్కలు నాటే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా డ్రగ్స్, గంజాయి వినియోగదారుల్లో సామాజిక బాధ్యత పెంపొందించి, వారిలో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు తెలిపారు.
మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతో పాటు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం ద్వారా వారిలో పరివర్తన తీసుకురావాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను గుర్తుచేసే ప్రయత్నం చేశారు.
కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ డి. రాంప్రసాద్, భువనగిరి టౌన్ ఇన్స్పెక్టర్ ఎం. రమేష్, ఎస్ఐ కే. లక్ష్మీనరసయ్య, జిల్లా జనరల్ హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ చక్రధర్, డీ-అడిక్షన్ సెంటర్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి