గోగు అంతమ్మ దశదినకర్మలో పాల్గొన్న బాలరాజ్ యాదవ్కు.టుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం
గోగు అంతమ్మ దశదినకర్మలో పాల్గొన్న బాలరాజ్ యాదవ్కు.టుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం
Editor Desk
రామన్నపేట,
యాదవ విద్యావంతుల వేదిక రామన్నపేట మండల అధ్యక్షుడు గోగు వెంకటేశ్వర్లు మాతృమూర్తి గోగు అంతమ్మ దశదినకర్మ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గోగు అంతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బాలరాజ్ యాదవ్, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం కుమారులు గోగు మల్లేష్, గోగు వెంకటేశ్వర్లు, గోగు శ్రీశైలంలను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ మహాసభ యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షుడు ముక్కామల దుర్గయ్య యాదవ్, మండల అధ్యక్షుడు తిరుగుడు మల్లికార్జున యాదవ్, మండల కార్యదర్శి జంగిల్ నరసింహ యాదవ్, ఉపాధ్యక్షుడు సింగనబోయిన జంగయ్య యాదవ్, విద్యావంతుల వేదిక మండల కార్యదర్శి ఆనంద్ యాదవ్, పోషబోయిన మల్లేష్ యాదవ్, ముక్కామల సత్తయ్య యాదవ్, తుమ్మల శేఖర్ యాదవ్, ఎడవెల్లి మాజీ సర్పంచ్ మర్రి రామలింగం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి