Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రొద్దంలో ఉషశ్రీపై మండల కూటమి నాయకుల ఫైర్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 13, 2026 06:06 PM

ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదు.. ట్రాఫిక్ నియమాలు పాటించండి

ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదు.. ట్రాఫిక్ నియమాలు పాటించండి

ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదు.. ట్రాఫిక్ నియమాలు పాటించండి
June 10, 2026 05:34 PM 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ మురళీధర్ భగవత్ పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్‌తో కలిసి హాజరైన ఆయన “ఆరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారందరూ సీటు బెల్ట్ వినియోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని, అలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను వినియోగించాలని తెలిపారు. గమ్యస్థానానికి చేరుకోవడం ముఖ్యమే అయినప్పటికీ సురక్షితంగా చేరుకోవడం మరింత ముఖ్యమని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ హరిప్రసాద్ ఫసల్వాడిలో “నో హెల్మెట్ – నో ఎంట్రీ” విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించగా, జిల్లా అధికారులు ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ ప్రజలతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించి హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News