ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదు.. ట్రాఫిక్ నియమాలు పాటించండి
ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదు.. ట్రాఫిక్ నియమాలు పాటించండి
Krishna
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ మురళీధర్ భగవత్ పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్తో కలిసి హాజరైన ఆయన “ఆరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారందరూ సీటు బెల్ట్ వినియోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని, అలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను వినియోగించాలని తెలిపారు. గమ్యస్థానానికి చేరుకోవడం ముఖ్యమే అయినప్పటికీ సురక్షితంగా చేరుకోవడం మరింత ముఖ్యమని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ హరిప్రసాద్ ఫసల్వాడిలో “నో హెల్మెట్ – నో ఎంట్రీ” విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించగా, జిల్లా అధికారులు ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ ప్రజలతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించి హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి