భవన నిర్మాణ కార్మికుల సమ్మెకు బి ఆర్ టి యు మద్దతు
భవన నిర్మాణ కార్మికుల సమ్మెకు బి ఆర్ టి యు మద్దతు
K.RAVI
– డిమాండ్లు పరిష్కరించాలని జిల్లా అధ్యక్షుడు ఢిల్లీ మాధవరెడ్డి డిమాండ్
చౌటుప్పల్ - నారాయణపురం మండల భవన నిర్మాణ కార్మిక సంఘం చేపట్టిన సమ్మెకు బి.ఆర్.టి.యు అనుబంధ సంఘం గురువారం పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో బి.ఆర్.టి.యు ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా బి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షుడు ఢిల్లీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.ఈ సంఘీభావ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ మున్సిపాలిటీ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు గుండాబోయిన రాములు, బాలముని నరసింహ, చుక్క యాదయ్య, గౌరవ అధ్యక్షులు బండారి మార్క్, మలియా దశరధ, బద్రి గాలయ్య, లందగిరి వెంకటేశం, ఎర్రం శ్రీనివాస్, కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ గౌడ్, ఉదరి యాదయ్య, సుర్వి యాదయ్య గౌడ్, మునుకుంట్ల సత్యనారాయణ, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, రాకేష్, మున్నా, జన్నవాని వెంకటేశం, బాతురాజు మహేష్, గజ్జల రాజు, బోడ నాగరాజు, యాదగిరి, లింగస్వామి, చామల వెంకటేష్, నరసింహ, వెంకటేష్, బిక్షపతి, రాజు, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి