నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సబ్ కలెక్టర్
నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సబ్ కలెక్టర్
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఏడు గురువారాలు – ఏడు ఆదివారాల జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా ఏడవ ఆదివారం సందర్భంగా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా, సబ్ కలెక్టర్కు ఆలయ విశిష్టత, జాతర ఉత్సవాల ప్రాముఖ్యత గురించి వివరించారు. జాతరకు పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు, ఎక్స్ ఆఫీస్ మెంబర్ శ్రీకాంత్ స్వామి, సిద్దు స్వామి, నాగేష్ స్వామి, ప్రవీణ్ స్వామి, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జాతర ఉత్సవాలు భక్తి, సంప్రదాయాల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి