భక్తుల సేవలో భద్రతా సిబ్బంది.. ఒకవైపు ఫిట్నెస్, మరోవైపు స్వచ్ఛతకు పెద్దపీట.
భక్తుల సేవలో భద్రతా సిబ్బంది.. ఒకవైపు ఫిట్నెస్, మరోవైపు స్వచ్ఛతకు పెద్దపీట.
Editor Desk
యాదగిరిగుట్ట,
టీజీ ఎస్పీఎఫ్ (తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం సిబ్బంది శుక్రవారం ప్రత్యేక ఫిట్నెస్ కార్యక్రమం నిర్వహించారు. తులసి కాటేజ్ నుంచి మల్లాపురం వరకు 10 కిలోమీటర్ల పరుగు చేపట్టి శారీరక దృఢత్వానికి ప్రాధాన్యం చాటారు.
అనంతరం యాదాద్రి కొండపై మాడవీధుల్లో ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని నిర్వహించి పరిశుభ్రత పనులు చేపట్టారు. భక్తులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కే. శేషగిరిరావు తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా మాడవీధుల్లో పేరుకుపోయిన చెత్తను సేకరించి ట్రాక్టర్ ద్వారా తరలించారు. పరిశుభ్రతతో పాటు ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన పెంచేలా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవి, ఏఎస్ఐలు, ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి